శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో పలు ఇళ్లలో
వ్యక్తిగతంగానూ, ఆలయాల్లో సామూహికంగా వ్రతాలను నిర్వహించారు. మహిళలు అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు.బస్టాండ్ సమీపంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ, వీరన్నపేటలోని చౌడేశ్వరీ మాత, ద్వారకామాయి బాబా మందిరం, వేంకటేశ్వర కాలనీలోని రాజరాజేశ్వరి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేపట్టారు. బ్రాహ్మణవాడిలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు బంగారు చీరలో దర్శనమిచ్చారు. – స్టేషన్ మహబూబ్నగర్
బ్రాహ్మణవాడి వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాయంలో బంగారుచీరలో అమ్మవారు
సామూహిక వరలక్ష్మి వ్రతంలో మహిళలు
ద్వారకామాయి ఆలయంలో అమ్మవారికి హారతిస్తున్న మహిళలు


