తెలకపల్లి: పురుగు మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు.. మండల పరిదిలోని గౌరెడ్డిపల్లికి చెందిన అతినారపు శ్రీకాంత్ (24) మెకానిక్గా పని చేసేవాడు. ఇటీవల ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాని ఆమెనే పెళ్లి చేసుకుంటానని కుటుంబసభ్యులకు చెప్పాడు. అయితే కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. తెలకపల్లి మండల సమీపంలోని పర్వతాపూరం రోడ్డులో ఓ చెట్టుకింద పురుగు మందు తాగి చనిపోతున్నట్లు అన్నకు ఫోన్ చేసి చెప్పాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే చనిపోయి పడి ఉన్నాడు. తండ్రి అతినారాపు బంగారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.


