సెజ్లోని పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థ జలాలను హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరుకు తీసుకెళ్లి అక్కడి ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేసిన తర్వాత బయటకు వదలాలి. ఖర్చు ఎక్కువైతుందనే ఉద్దేశంతో ఫ్యాక్టరీల నిర్వాహకులు కాలుష్యపు జలాలను ఇక్కడే పంట పొలాల్లోకి నేరుగా వదులుతున్నారు. కొందరైతే ట్యాంకర్లలో తీసుకొచ్చి మా గ్రామ శివారు, వ్యవసాయ భూముల్లో పారబోస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు సీరియస్గా స్పందించాలి. – కిష్టారం మల్లేష్ గౌడ్, రాయపల్లి


