జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,552, కనిష్టంగా రూ.1,901 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,239, కనిష్టంగా రూ. 1,651, వేరుశనగ రూ.5,454, ఆముదాలు రూ.6,371 చొప్పున పలికాయి.
● గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు బుధవారం 843 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టం రూ.6,750, కనిష్టం రూ.2,811, సరాసరి రూ. 6419 ధరలు లభించాయి. 5 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. క్వింటాల్ రూ.2,587 ధర పలికింది. అలాగే 5 క్వింటాళ్ల కంది రాగా క్వింటాల్కు రూ.6,419 ధర వచ్చింది.


