
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
అలంపూర్: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి సాధ్యమని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి సక్రియ నాయక్ పేర్కొన్నారు. వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు పంటల సాగుకు సన్నద్ధం అవుతుండడంతో ఆయన పలు సూచనలు చేశారు. బ్రీడర్, సర్టిఫైడ్, టూత్ ఫూల్ లేబుల్స్లో నాణ్యమైన విత్తనాలు లభిస్తాయని ఇందులో ఏ రకాన్ని సాగు చేసినా మంచి ఫలితం ఉంటుందన్నారు. వీటితో రైతులు విత్తన భారం తగ్గించుకోవడంతో పాటు తోటి రైతులకు అందించి అధిక రేటు పొందవచ్చన్నారు.
బ్రీడర్ విత్తనం :
ఇది అన్ని రకాల విత్తనాలకు మూల విత్తనం. దీన్ని కంపెనీలు ఆయా బ్రీడర్ల పర్యవేక్షణలో పండిస్తారు. వ్యవసాయ పరిశోధన స్థానాల్లో శాస్త్రవేత్తలు తయారు చేసేది ఇలాంటి విత్తనాలే. ఈ విత్తనం వంద శాతం జన్యు నాణ్యత కలిగి ఉంటుంది. బ్రీడర్ సీడ్కు బంగారు రంగు ట్యాగ్ వేస్తారు. సీడ్ ధర ఎక్కువ. రైతులకు రెండు కిలోలకు మించి ఇవ్వరు.
ఫౌండేషన్ విత్తనం :
ఈ విత్తనాన్ని బ్రీడర్ విత్తనం నుంచి ఉత్పత్తి చేస్తారు. వివిధ విత్తనోత్పత్తి సంస్థలు, సాంకేతిక నిపుణుల అధ్వర్యంలో వీటిని పండిస్తారు. దాదాపు వంద శాతం జన్యు నాణ్యత ఉంటుంది. ప్రైవేటు విత్తన కంపెనీలు వ్యవసాయ పరిశోధన సంస్థల నుంచి బ్రీడర్ విత్తనాలు తీసుకెళ్లి ఫౌండేషన్ విత్తనాన్ని తయారు చేస్తాయి. ఈ సీడ్కు తెలుపు రంగు ట్యాగ్ వేస్తారు.
సర్టిఫైడ్ (ధ్రువీకరించిన) విత్తనం :
దీన్ని ఫౌండేషన్ విత్తనం నుంచి వేరుగా ఉత్పత్తి చేస్తారు. వివిధ సంస్థలు, రైతుల పొలాల్లో విత్తన పర్యవేక్షకుల సమక్షంలో వీటిని తయారు చేస్తారు. ఈ విత్తనానికి నీలి రంగు ట్యాగ్ వేస్తారు.
పాడి–పంట

నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి

నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి