
టూర్ ప్యాకేజీలను వినియోగించుకోవాలి
నెహ్రూసెంటర్: ఆర్టీసీ మహబూబాబాద్ డిపో ఆధ్వర్యంలో ప్రజలు, ప్రయాణికుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీల ద్వారా బస్సులు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ తెలిపారు. ఆర్టీసీ యాత్ర కరపత్రాలను గురువారం డిపో ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ.. మహబూబాబాద్ నుంచి 5 ప్రత్యేక ప్రాంతాలకు యాత్ర ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. టూర్ ప్యాకేజీ కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీజీఎస్ఆర్టీసీబస్.ఇన్ అనే వెబ్సైట్, లేదా 99592 26054, 94417 13896, 99482 14022 నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది శ్రీనివాస్, పాపిరెడ్డి, కేఆర్ రెడ్డి, శంకర్, ఎండి.నబీ తదితరులు పాల్గొన్నారు.