వసతులు లేక విద్యార్థుల ఇక్కట్లు | - | Sakshi
Sakshi News home page

వసతులు లేక విద్యార్థుల ఇక్కట్లు

Jun 20 2025 6:29 AM | Updated on Jun 20 2025 6:29 AM

వసతులు లేక విద్యార్థుల ఇక్కట్లు

వసతులు లేక విద్యార్థుల ఇక్కట్లు

అద్దె భవనాల్లో పలు పాఠశాలలు

శిథిలావస్థ గదుల్లో భయంగా చదువులు

మూత్రశాలలు లేక ఆరుబయటే

మూత్రవిసర్జన

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల రాత మారడం లేదు. అభివృద్ధి పనులు, సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం నిధులు సమకూర్చుతున్నప్పటికీ అసంపూర్తి పనులే దర్శనమిస్తున్నాయి. ప్రహరీ లేకపోవడంతో, శిథిలావస్థ బడులు, తాగునీరు, మరుగుదొడ్లు, టాయిలెట్‌ సమస్యలు పేరుకుపోయాయి. మూత్రశాలలు లేక విద్యార్థులు ఆరుబయటకు వెళ్లి మూత్రవిసర్జన చేస్తున్న దుస్థితి నెలకొంది. కొన్నిచోట్ల పాఠశాలలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. గురువారం ‘సాక్షి’ విజిట్‌లో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement