
ఆర్ట్స్ కాలేజీ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు విడుద
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ (అటానమస్)లో బీఏ, బీకాం, బీఎస్సీ 2,4,6 సెమిస్టర్ల పరీక్షల ఫలితాలను గురువారం కేయూ వీసీ ప్రతాప్రెడ్డి ఆ కళాశాలలో విడుదల చేశారు. రెండో సెమిస్టర్ పరీక్షలకు 1,236మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 620 మంది (50.16శాతం) ఉత్తీర్ణత సాధించారు. నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 927మంది విద్యార్థులు హాజరుకాగా 540 మంది ఉత్తీర్ణత( 58.25శాతం) సాధించారు. అలాగే, ఆరో సెమిస్టర్ పరీక్షలకు 742 మంది విద్యార్థులు హాజరుకాగా 582 మంది (78.44శాతం) ఉత్తీర్ణత సాధించారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి తెలిపారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పరీ క్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, ఆ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి సుధీర్, గిరిప్రసాద్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.