పసుపు రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

పసుపు రైతుల ఆందోళన

Jun 20 2025 6:57 AM | Updated on Jun 20 2025 6:57 AM

పసుపు రైతుల ఆందోళన

పసుపు రైతుల ఆందోళన

వరంగల్‌ చౌరస్తా : తెలంగాణ రాష్ట్రంలోని ఇతర మార్కెట్లలో పసుపు క్వింటాల్‌కు ధర రూ. 12,500 పలుకుతుండగా, వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రూ. 10వేల చొప్పన వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో గురువారం రైతులు ఆందోళన చేపట్టారు. ధర పెంచే వరకూ అమ్మబోమని తేల్చిచెప్పారు. దీంతో కాంటాలు నిలిచాయి. వ్యాపారులు తమను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌ అధికారులు చొరవ చూపించినా రైతులు అంగీకరించలేదు. చివరకు మార్కెట్‌ కార్యదర్శి గుగులోత్‌ రెడ్డి జోక్యం చేసుకుని వ్యాపారులతో చర్చలు జరపగా, క్వాలిటీ పసుపునకే ఎక్కువ ధర చెల్లిస్తామని, లేనిపక్షంలో చెల్లించమని పేర్కొన్నారు. అనంతరం కార్యదర్శి రైతులతో మాట్లాడి సరైన ధరలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కాంటాలు ప్రారంభమయ్యాయి.

ధర వ్యత్యాసంతో వ్యాపారులపై

అన్నదాతల అసహనం

సర్దిచెప్పిన మార్కెట్‌ అధికారులు

మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైన

కాంటాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement