
సికిల్ సెల్ ఎనిమియా నిర్మూలనకు కృషి
మహబూబాబాద్ అర్బన్: సికిల్ సెల్ ఎనిమియా నిర్మూలనకు కృషి చేస్తామని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో గురువారం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డీఎంహెచ్ఓ హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సికిల్ సెల్ ఎనిమియా నిర్మూలనకు సమష్టిగా కృషి చేస్తున్నాయన్నారు. జిల్లాలో జూలై 3వతేదీ వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జిల్లాలో 23,2000 మందికి పరీక్షలు చేశామని చెప్పారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ గుగులోతు దేశీరాం నాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీస ర్లు సారంగం, లక్ష్మీనారాయణ, విజయ్కుమార్, మౌనిక, ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ కేవీ.రాజు, సూ పర్వైజర్ కే.ఎల్.ఎన్.స్వామి, పుష్పలీల, కిరణ్మ యి, శ్రీనివాస్, హెచ్ఎం నరసయ్య, ఉపాధ్యాయులు, ఆశకార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బడిబాటలో..
బడి బాటలో ప్రతీ ఒక్కరిని నడిపించాలన్నదే లక్ష్యమని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈఓలతో గురువారం జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది బడిబాటను కొత్త ఆవిష్కరణలతో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,616 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారన్నారు. సమావేశంలో ఏడీ రాజేశ్వర్, ఏఎంఓ ఆజాద్, సైన్స్ అధికారి అప్పారావు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.