
శిథిలావస్థలో తరగతి గదులు
తొర్రూరు రూరల్: మండలంలోని గుర్తూరు జెడ్పీ, ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే మూడు తరగతి గదులు మాత్రమే ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే హైస్కూల్లో 100 మంది విద్యార్థులు ఉండగా, నాలుగు తరగతులకు మాత్రమే గదులు ఉన్నాయి. దీంతో మరో తరగతి విద్యార్థులకు స్టాఫ్రూమ్ వరండాలో క్లాస్లు కొనసాగుతున్నాయి. ఉన్న తరగతి గదులు కూలిపోయే దశలో ఉండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు.