
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
నెహ్రూసెంటర్: జిల్లాలోని సీరోలు మండల కేంద్రానికి చెందిన కృష్ణను హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ మార్చురీ ఎదుట మృతుడి భార్య సత్యవతి, పిల్లలతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులు స్పందించి భూ సమస్య పరిష్కరించాలన్నారు. కృష్ణను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జీజీహెచ్ మార్చురీ నుంచి అండర్ బ్రిడ్జి వరకు మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అధికారులు తమకు న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే వెళ్లిపోతామంటూ భీష్మించి కూర్చున్నారు. సంఘటన స్థలికి టౌన్ సీఐ మహేందర్, మరిపెడ సీఐ రాజ్కుమార్, సీరోలు ఎస్సై నగేశ్, టౌన్ ఎస్సై విజయ్కుమార్ చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని అధికారుల హామీతో ఆందోళన విరమించారు.