గ్రామస్థాయి నుంచే భూ సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

గ్రామస్థాయి నుంచే భూ సమస్యల పరిష్కారం

Apr 24 2025 1:54 AM | Updated on Apr 24 2025 1:54 AM

గ్రామస్థాయి నుంచే భూ సమస్యల పరిష్కారం

గ్రామస్థాయి నుంచే భూ సమస్యల పరిష్కారం

నెల్లికుదురు: భూ భారతి చట్టం ద్వారా గ్రామస్థాయి నుంచి భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్‌ అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు పడిన ఇబ్బందులను తొలగించడానికే ప్రస్తుత ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టంలో జూన్‌ మొదటివారం నుంచి ప్రతీ గ్రామంలో గ్రామ పాలన అధికారి (జీపీఓ) ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి విచారణ జరిపి అక్కడే సమస్య పరిష్కరిస్తారని, లేకుంటే తహసీల్దార్‌ వద్ద, అక్కడ కాకుంటే ఆర్డీఓ వద్ద, ఇంకా సమస్య పెద్దది అయితే కలెక్టర్‌ వద్ద ధరఖాస్తు చేసుకున్న నెల రోజుల లోపు ప్రతి భూ సమస్య పరిష్కారం కోసమే ప్రభుత్వం పకడ్బందీగా చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేందుకే సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్‌ వీరబ్రహ్మచారి, తొర్రూరు ఆర్డీఓ గణేష్‌, తహసీల్దార్‌ కె.రాజు, ఎంపీడీఓ బాలరాజు, డిప్యూటీ తహసీల్దార్‌ తరంగిణి, ఏడీఏ పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

నర్సింహులపేట: భూభారతి చట్టాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతిచట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈ చట్టం ద్వారా రైతులకు పారదర్శకంగా సులభతరమైన విస్తృత సేవలు అందుతాయని తెలిపారు. రెవెన్యూ సదస్సుకు హాజరైన రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పారు.అదనపు కలెక్టర్‌ వీరబ్రహ్మచారి, ఆర్‌డీఓ గణేష్‌, ఏడీఏ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ నాగరాజు, ఎ ంపీడీఓ యాకయ్య, ఏఓ వినయ్‌కుమార్‌ ఉన్నారు.

సమస్యల పరిష్కారం..

కేసముద్రం: భూభారతి చట్టం ద్వారా ఎన్నోఏళ్లుగా పేరుకుపోయిన భూసమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ అన్నారు. బుధవారం ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఈ చట్టంలో ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. అదనపు కలెక్టర్‌ కె.వీరబ్రహ్మచారి, ఆర్‌డీఓలు కృష్ణవేణి, గణేష్‌, తహసీల్దార్‌ రవీందర్‌, ఎంపీడీఓ హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ అద్వైత్‌ కుమార్‌ సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement