ఇసుక ట్రాక్టర్ల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

Apr 22 2025 1:15 AM | Updated on Apr 22 2025 1:19 AM

మరిపెడ రూరల్‌: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుని, ముగ్గురి వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బొలగాని సతీష్‌ సోమవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మరిపెడ మండలంలో అకేరు, పాలేరు వాగుల నుంచి ఇసుక రవాణాను అడ్డుకట్ట వేసేందుకు రెవెన్యూ, పోలీస్‌ శాఖలు సంయుక్తంగా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని, మండలంలోని బీచ్‌రాజ్‌పల్లి గ్రామానికి చెందిన చిదుముల విజయ్‌, బాల్నిధర్మారానికి చెందిన గుడిమల్ల ఉపేందర్‌, చిన్నగూడూరు మండలం విస్సంపల్లికి చెందిన బొమ్మ రవిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

పౌష్టికాహారం తీసుకోవాలి

మరిపెడ/నర్సింహులపేట: పిల్లలు, మహిళలకు పోషకాహారాన్ని అందించాలని స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి గుగులోతు రవి అన్నారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో మరిపెడలో పోషణ్‌ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు రాజ్యలక్ష్మీ, సీడీపీఓ ఎల్లమ్మ , అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎం, ఆశలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement