దివ్యాంగులకు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు ఏర్పాట్లు చేయాలి

Published Wed, Nov 15 2023 1:16 AM | Last Updated on Wed, Nov 15 2023 1:16 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ శశాంక - Sakshi

మాట్లాడుతున్న కలెక్టర్‌ శశాంక

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక

మహబూబాబాద్‌: జిల్లాలోని ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, ర్యాంప్‌లు ఇతర ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమావేశ మందిరంలో మంగళవారం పోలింగ్‌ కేంద్రాల్లో దివ్యాంగులు, వయోవృద్ధుల వసతులపై డీడబ్ల్యూఓ వరలక్ష్మి, సీడీపీఓలు, సంబంధిత ఎన్నికల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పూర్తిస్థాయిలో డోర్నకల్‌, మానుకోట నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. రెండు నియోజకవర్గాలలో 348 లొకేషన్లలో 539 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 348 లొకేషన్లలో 348 వీల్‌చైర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 25వ తేదీలోపు తహసీల్దార్లు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల ఆధ్వర్యంలో మండల కార్యాలయాలు, మున్సిపాలిటీలకు వీల్‌చైర్లు అందుతాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement