శ్రీ మఠం పీఠాధిపతికి తులాభారం
మంత్రాలయం: శ్రీ మఠం పీఠాధపతి సుబుధేంద్ర తీర్థులుకు వివిధ రకాల డ్రైఫ్రూట్స్తో సోమవారం తులాభారం చేసి జ్ఞాపికను అందజేశారు. తమ పాదయాత్ర 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భగా సిరుగుప్ప ఆర్యవైశ్య సంఘం వారు శ్రీ మఠం పీఠాధిపతిని సన్మానించారు. శ్రీ రాఘవేంద్ర సర్కిల్ నుంచి ప్రత్యేక ఆలంకరించిన వాహనంలో వాయిద్యాల నడుమ ఊరేగించారు. శ్రీ మఠంలోని యోగీంద్ర కళామండంపంలో ముత్యాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మట్లాడుతూ..సిరుగప్ప ఆర్యవైశ్య సంఘం 30 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనీయమన్నారు. శ్రీ రాఘవేంద్ర స్వాముల ఆశీర్వాదం భక్తులకు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. సిరుగుప్ప ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు హెచ్.జి హనుమంతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 900 మంది పాల్గొన్నారు.


