
మంత్రాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం రాత్రి మంత్రాలయం వచ్చారు. వందేభారత్ రైలులో మంత్రాలయం రోడ్డు (తుంగభద్ర) రైల్వే స్టేషన్లో దిగారు. అక్కడ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి మాధవరం మీదుగా రోడ్డు మార్గంలో మంత్రాలయం చేరుకున్నారు. స్థానికంగా ట్రాన్స్కో సీఎండీ సంతోషరావు, జాయింట్ కలెక్టర్ నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ట్రాన్స్ ఎస్ఈ ఉమాపతి, అడిషినల్ ఎస్పీ ఉసేన్పీరా పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఉదయం ఆయన స్వామిని దర్శించుకోనున్నారు.