వెబ్‌సైట్లలో ఎంపిక జాబితా | - | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్లలో ఎంపిక జాబితా

Jun 17 2025 5:04 AM | Updated on Jun 17 2025 5:04 AM

వెబ్‌సైట్లలో ఎంపిక జాబితా

వెబ్‌సైట్లలో ఎంపిక జాబితా

19న కర్నూలు మెడికల్‌ కాలేజీలో

కౌన్సెలింగ్‌

కర్నూలు(హాస్పిటల్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ, జనరల్‌ హాస్పిటల్స్‌, నర్సింగ్‌ కాలేజీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి 10 కేటగిరి అభ్యర్థుల ఫైనల్‌ మెరిట్‌, సెలక్షన్‌ లిస్టులు ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉంచినట్లు కర్నూలు మెడికల్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు వారి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, రెండు సెట్ల నకలు సర్టిఫికెట్లతో ఈ నెల 19న ఉదయం 10.30 గంటలకు కర్నూలు మెడికల్‌ కాలేజిలోని ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. అలా హాజరుకాని వారి ఎంపిక రద్దు చేస్తామని తెలిపారు. ఎంపిక జాబితా వివరాలు https:// kurnool.ap.gov.in, https://nandyal.ap. gov.in, https://kurnoolmedicalcollege. ac.in ఉంచినట్లు తెలిపారు.

అన్నదాత సుఖీభవ

రైతులకు ఈ–కేవైసీ తప్పనిసరి

కర్నూలు(అగ్రికల్చర్‌): అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయానికి అర్హత పొందిన రైతులు వెంటనే బయోమెట్రిక్‌ ద్వారా ఈ–కేవైసీ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి తెలిపారు. జిల్లాలో అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయానికి 2,55,265 మంది రైతులు అర్హత పొందారన్నారు. ఇప్పటి వరకు 2,49,251 మంది రైతులు ఈ–కేవైసీ చేయించుకున్నారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత పొందిన రైతులు ఈ నెల 20లోపు విధిగా ఈ–కేవైసీ చేయించుకోవాలన్నారు. లేదంటే పెట్టుబడి సాయానికి అర్హత కోల్పోతారని, ఏ రైతు సేవ కేంద్రంలోనైనా ఈ–కేవైసీ చేయించుకోవచ్చని పేర్కొన్నారు.

అర్జీలను త్వరగా

పరిష్కరించండి

నందవరం: తల్లికి వందనం అర్జీలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమ వారం ఆయన మండల కేంద్రంలోని తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో చేపట్టే రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలన్నారు. పెండింగ్‌లోని గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీఓ పుల్లయ్య, డిప్యూటీ ఎంపీడీఓ సందీప్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement