
గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలి
నందవరం: గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. సోమవారం ఆయన మండల కేంద్రం పోలీసు స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం నాగలదిన్నె వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు తనిఖీ చేశారు. అలాగే గురజాల గ్రామంలో వెలసిన రామలింగేశ్వర స్వామి, పార్వతీ దేవిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. గ్రామాల్లో నేర నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట ఎమ్మిగనూరు రూరల్ సీఐ మధుసుధన్ రావు, ఎస్ఐ కేశవ ఉన్నారు.