‘సూపర్‌సిక్స్‌’ పేరుతో ప్రజలకు వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

‘సూపర్‌సిక్స్‌’ పేరుతో ప్రజలకు వెన్నుపోటు

Jun 17 2025 5:04 AM | Updated on Jun 17 2025 5:04 AM

‘సూపర్‌సిక్స్‌’ పేరుతో ప్రజలకు వెన్నుపోటు

‘సూపర్‌సిక్స్‌’ పేరుతో ప్రజలకు వెన్నుపోటు

మంత్రాలయం: సీఎం పదవి కోసం ‘కూటమి’గా ఏర్పడి, సూపర్‌ సిక్స్‌ పేరుతో రాష్ట్ర ప్రజలను టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి విమర్శించారు. సోమవారం స్వగ్రామం రాంపురంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డితో కలిసి వెన్నుపోటు పుస్తకాలు, వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆనాడు పార్టీ కోసం సొంత మామనే వెన్నుపొడిచి చంద్రబాబు చరిత్రకెక్కారని విమర్శించారు. వెన్నుపోటు పొడవటంలో సీఎం చంద్రబాబు ఎంతో దిట్టని ఆరోపించారు. పొత్తులు లేకుండా ఏనాడు ఆయన అధికారంలోకి వచ్చింది లేదని గుర్తు చేశారు. అధికార దాహంతో 143 హామీలు గుప్పించి ఏడాది పాలనలో కేవలం రెండు పథకాలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.

అక్రమ కేసులు .. అఘాయిత్యాలు

చంద్రబాబు ఏడాది పాలన అంతా రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడిచిందని ఎమ్మెల్యే విమర్శించారు. కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్‌ చేసుకుని అక్రమ కేసులు బనాయింపుతో సరిపెట్టుకున్నారన్నారు. మహిళలు, చిన్నారులపై రాష్ట్ర వ్యాప్తంగా అఘాయిత్యాలు ఎక్కువైనా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. హామీలను మరిపించేందుకు రోజుకో ఘటన తెరపైకి తెస్తున్నారన్నారు. తల్లికి వందనం పథకంలోనూ చంద్రబాబు వైఫల్యాలు కుప్పలు తెప్పలుగా బయటకు వస్తున్నాయన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తంరెడ్డి, జిల్లా కార్యదర్శులు ఏకాంబరరెడ్డి, మాబుసాబ్‌, యువజన విభాగం రాష్ట్ర సహాయ కా ర్యదర్శి రఘురామ్‌, ఆయా మండలాల కన్వీనర్లు జి.భీమారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ప్రహ్లాదాచార్‌, బెట్ట నగౌడ్‌, బూత్‌ కమిటీ నియోజకవర్గ కన్వీనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, కౌతాళం ఎంపీపీ అమరేష్‌ పాల్గొన్నారు.

మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement