
శ్రీమఠం.. భక్తజనసంద్రం
శ్రీమఠం కారిడార్లో పోటెత్తిన భక్తులు
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠాన్ని ఆదివారం రెండు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల వసతులపై ఆరా తీశారు. భోజనశాల, పరిమళ ప్రసాదం, క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలించారు. భోజనశాలలో వంటలు ఎలా చేశారని పర్యవేక్షించారు. భక్తులతో ముచ్చటించి భోజనాల నాణ్యత తెలుసుకున్నారు. అలాగే మఠం పరిధిలో జరుగుతున్న పలు ప్రగతి పనులను పరిశీలించారు. భక్తుల రాకతో తుంగాతీరం, కారిడార్, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లలో కోలాహలం నెలకొంది.

శ్రీమఠం.. భక్తజనసంద్రం