అధిక సంతానం అన్ని రకాలుగా అనర్థమని, ఒకరిద్దరిని మాత్రమే కనాలని కొన్ని దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు దండోరా వేయించేవి. దీనిపై ఎక్కువ ప్రచారం చేయడంతో పాటు అధిక సంతానం వల్ల కలిగే ఇబ్బందులను ప్రజలు గుర్తించారు. ఈ మేరకు కుటుంబ నియంత్రణ వైపు మొగ్గు చూపారు. | - | Sakshi
Sakshi News home page

అధిక సంతానం అన్ని రకాలుగా అనర్థమని, ఒకరిద్దరిని మాత్రమే కనాలని కొన్ని దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు దండోరా వేయించేవి. దీనిపై ఎక్కువ ప్రచారం చేయడంతో పాటు అధిక సంతానం వల్ల కలిగే ఇబ్బందులను ప్రజలు గుర్తించారు. ఈ మేరకు కుటుంబ నియంత్రణ వైపు మొగ్గు చూపారు.

Jun 16 2025 5:55 AM | Updated on Jun 16 2025 5:55 AM

అధిక

అధిక సంతానం అన్ని రకాలుగా అనర్థమని, ఒకరిద్దరిని మాత్రమే

కుటుంబ నియంత్రణ

పాటిస్తున్న జంటలు

అధిక సంతానం భారంగా

భావిస్తున్న యువత

పిల్లల చదువు, ఉద్యోగం, పెళ్లిళ్లు

బాధ్యతలు భారమవుతున్న వైనం

ఒకరు, ఇద్దరు సంతానానికే పరిమితం

ఏటా పెరుగుతున్న కు.ని ఆపరేషన్లు

కుటుంబ నియంత్రణకు

స్వచ్ఛందంగా ముందుకు

క్షేత్రస్థాయిలోని పీహెచ్‌సీ, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ లెవెల్స్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా తాత్కాలిక పద్ధ్దతులైన ఐయుసీడీ, ఆంత్రో ఇంజెక్షన్లు, ఎమర్జెన్సీ పిల్స్‌, మగవారికి నిరోధ్‌లపై వైద్య సిబ్బంది ఎక్కువగా చెబుతున్నారు. దీనివల్ల కాన్పుకు, కాన్పునకు మధ్య ఎడమ కనీసం రెండు, మూడేళ్లు వస్తుంది. టీనేజిలో గర్భం దాల్చకుండా కూడా ఈ విధానాలు ఉపయోగపడతాయి. దీనివల్ల మాతృమరణాలు జరగకుండా ఉంటాయి. తల్లీబిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు. అధిక శాతం ప్రజలు రెండు కాన్పుల తర్వాత ట్యూబెక్టమి, డీపీఎల్‌ వేసక్టమి విధానంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.

–డాక్టర్‌ పి.శాంతికళ, డీఎంహెచ్‌వో, కర్నూలు

జిల్లాలో కుటుంబ నియంత్రణ

ఆపరేషన్లు

సంవత్సరం ట్యూబెక్టమి వేసక్టమి

(ఉమ్మడి జిల్లా)

2019-20 16,556 0

2020-21 7,728 1

(కర్నూలు జిల్లా)

2021-22 7,575 1

2022-23 6,989 1

2023-24 8,836 3

2025-26 9,824 10

కర్నూలు(హాస్పిటల్‌): చిన్న కుటుంబం...చింతలేని కుటుంబమని ఆధునిక జంటలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే అధిక శాతం ఇద్దరు పిల్లలకే కు.ని ఆపరేషన్లు చేయించుకుంటూ ఉండగా మరి కొందరైతే ఒకరే చాలని సరిపెట్టేసుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుత అంచనా ప్రకారం 44 క్షలకు పైగా జనాభా ఉంది. 2001లో 40 లక్షలు ఉన్న జనాభా 2011 జనాభా లెక్కల నాటికి 44లక్షలకు చేరుకుంది. ఇప్పటికి మరో ఆరు లక్షలకు దాటి జిల్లా జనాభా 50 లక్షలకు చేరినట్లు అంచనా. ఒకప్పుడు పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రోత్సహించాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నగదుతో పాటు బహుమతులు కూడా పంచిపెట్టాయి. ట్యూబెక్టమి ఆపరేషన్‌ అయితే కోత, కుట్టు ఉంటుందని, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని భావించి పెద్దగా కోత, కుట్టు లేని, త్వరగా కోలుకునే అవకాశం ఉన్న డీపీఎల్‌ ఆపరేషన్లను ప్రారంభించారు. ఈ మేరకు వైద్య సిబ్బందికి అవగాహన కల్పించి వారి ద్వారా బాలింతలను ఆసుపత్రికి తీసుకొచ్చి మరీ డీపీఎల్‌ ఆపరేషన్లు చేయించారు. ప్రస్తుతం కర్నూలు, నంద్యాల, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పీపీ యూనిట్లతో పాటు ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, బేతంచర్ల, డోన్‌, నందికొట్కూరు, గూడూరు, గార్గేయపురం, డోన్‌తో పాటు కర్నూలులోని గడియారం ఆసుపత్రిలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు.

సీఎం చెప్పినా వినేది లేదు..

రాష్ట్ర విభజన తర్వాత జనాభా తగ్గిందని, ప్రజలు సంతానాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014లోనే ప్రకటించారు. ఈ మేరకు 2014వ సంవత్సరం వరకు ఏడాదికి 34వేల వరకు ఉన్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల లక్ష్యంను ఎత్తేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు సంబంధించి ప్రజలపై ఒత్తిడి తేవొద్దని, లక్ష్యాలు ఏమీ వద్దని అప్పట్లో ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఆయన పాత విధానాన్నే అవలంభిస్తూ ప్రజలు జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని, ఎంత మందిని వీలైతే అంత మందిని కనాలని, వారి బాగోగులు చూసుకునే బాధ్యత నాదని చెబుతున్నారు. కానీ ఆయన మాటలను ఎవ్వరూ విశ్వసించడం లేదు. ఇద్దరు పిల్లలు కాగానే అధిక శాతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రెండో కాన్పు సమయంలో సిజేరియన్‌ అయితే ఒకేసారి కు.ని ఆపరేషన్‌ కూడా చేయిస్తున్నారు.

మేము సైతం అంటున్న మగాళ్లు..

కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ అంటే అది కేవలం మహిళలు మాత్రమే చేయించుకుంటారన్న ధోరణిలో మగవారు ఉండేవారు. ఈ మేరకు 2011 నుంచి 2019 వరకు జిల్లాలో ఒక్క పురుషుడు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌(వేసక్టమి) చేయించుకోలేదు. ఆ తర్వాత 2020 నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క మగాడు ఆపరేషన్‌ చేయించుకుంటూ వస్తున్నారు. 2023–24లో ఈ సంఖ్య మూడుకు చేరగా గత ఏడాది ఏకంగా పది మంది మగవారు కు.నిలో భాగంగా వేసక్టమి ఆపరేషన్‌ చేయించుకున్నారు. పెద్దగా కోత, కుట్టు లేకపోయినా, రక్తస్రావం రాకపోవడం, ఆపరేషన్‌ తర్వాత కూడా సంసార జీవితానికి ఎలాంటి ఢోకా లేకపోవడం, ఈ అంశాలపై వైద్యులు, సిబ్బంది అవగాహన కల్పించడంతో ఆపరేషన్‌ చేయించుకునే మగవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.

పిల్లలను పెంచాలంటే భారమని..!

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. తల్లిదండ్రులతో పాటు అన్నదమ్ములు అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు. మగవారు ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులకు వెళితే ఇంట్లో ఉన్న ఆడవారిలో ఎవరో ఒకరు పిల్లల ఆలనాపాలనా చూసుకునేవారు. అంతేకాదు ఆదాయ వ్యయాలు కూడా కలిసి పంచుకునేవారు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా కలిసి భరించేవారు. కానీ ఇప్పుడు చిన్నకుటుంబాలు అధికమయ్యాయి. వివాహమైన వెంటనే వేరుకాపురం పెట్టేవారు ఎక్కువయ్యారు. ఈ కండిషన్‌పైనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి కూడా. దీంతో పిల్లలు కలిగితే వారిని చూసుకునేవారు కరువయ్యారు. వారిని పెంచి పెద్ద చేయడమే కాదు వారి చదువులు నేటి పరిస్థితుల్లో భారంగా మారాయి. అంతేకాదు పెద్దయ్యాక వారికి వివాహాలు చేయడం తలకుమించిన భారంగా మారడంతో ఇద్దరు లేదా.. ఒక సంతానికే పరిమితమవుతున్నారు.

అధిక సంతానం అన్ని రకాలుగా అనర్థమని, ఒకరిద్దరిని మాత్రమే1
1/3

అధిక సంతానం అన్ని రకాలుగా అనర్థమని, ఒకరిద్దరిని మాత్రమే

అధిక సంతానం అన్ని రకాలుగా అనర్థమని, ఒకరిద్దరిని మాత్రమే2
2/3

అధిక సంతానం అన్ని రకాలుగా అనర్థమని, ఒకరిద్దరిని మాత్రమే

అధిక సంతానం అన్ని రకాలుగా అనర్థమని, ఒకరిద్దరిని మాత్రమే3
3/3

అధిక సంతానం అన్ని రకాలుగా అనర్థమని, ఒకరిద్దరిని మాత్రమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement