గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

Apr 18 2025 1:52 AM | Updated on Apr 18 2025 1:52 AM

గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

గోనెగండ్ల: గంజిహళ్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ విజయభాస్కర్‌ తెలిపిన వివరాల మేరకు.. గ్రా మానికి చెందిన బోయ కండ్ల వెంకటేష్‌(70)కు భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటేష్‌కు గత ఆరేళ్ల నుంచి రెండు కాళ్ల బొటన వేళ్లకు కష్టు వ్యాధి వచ్చింది. అలాగే షుగర్‌ కూడా ఉంది. దీంతో కాళ్లనొప్పి ఎక్కువై మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెంది ఈనెల 15వ తేదీన రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో గడ్డి మందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. భార్య, కుమారులు గమనించి ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బుధవారం కర్నూలుకు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం తెల్లవారు జామున మృతిచెందినట్లు సీఐ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement