
దుర్గమ్మకు విరాళాల సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలువురు భక్తులు సోమవారం విరాళాలు అందజేశారు. విజయవాడ కరెన్సీనగర్కు చెందిన ఎస్.కృష్ణ, అనంతలక్ష్మి దంపతులు అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు రూ.లక్ష, భవానీపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డుకు చెందిన యు. లక్ష్మీపార్వతి తన భర్త వెంకటేశ్వరరావు పేరిట నిత్యాన్నదానానికి రూ. 1,00,101 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.