బస్టాండ్‌లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

Aug 15 2025 6:42 AM | Updated on Aug 15 2025 6:42 AM

బస్టా

బస్టాండ్‌లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

వైభవంగా అమరేశ్వర స్వామి వార్ల పవిత్రోత్సవాలు అమరావతి: అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం అలయ అర్చకులు, వేద పండితులు మండప పూజ, దీక్ష హోమం, రుద్ర హోమం, పవిత్రధారణ, చండీ హోమం జరిపి హారతి మంత్రపుష్పాలు సమ ర్పించారు. అనంతరం స్వామివార్లకు పట్టు పవిత్రములు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రేఖ మాట్లా డుతూ విజయవాడకు చెందిన యార్లగడ్డ ఉపేంద్ర, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో స్వామి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం ఉదయం పవిత్రోత్సవాలు ముగింపు సందర్భంగా 11 గంటలకు మహా పూర్ణాహుతి నిర్వహిస్తామని పేర్కొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలకు ఉచిత బస్సు (సీ్త్ర శక్తి) పథకాన్ని ప్రారంభించేందుకు విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను గురువారం పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు పరిశీలించారు. బస్టాండ్‌తో పాటు, పరిసర ప్రాంతాల్లో భద్రతా పరంగా ఎలాంటి చిన్న లోపాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్నిశాఖల అధికారుల సమ న్వయంతో అప్రమత్తంగా ఉంటూ, బందో బస్తు నిర్వహించాలని సూచించారు. ముఖ్య మంత్రితో పాటు, మంత్రులు, వీవీఐపీలు, ఇతర అధికారులు ప్రయాణించే మార్గాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, పార్కింగ్‌ ప్రదేశాలు, ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కె.జి.వి. సరిత, ఎస్‌.వి.డి.ప్రసాద్‌, ఏడీసీపీ ఎ.వి.ఎల్‌. ప్రసన్నకుమార్‌, సౌత్‌ ఏసీపీ పావన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు సీ్త్రశక్తి పథకం ప్రారంభం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం సీ్త్ర శక్తి పథకం శుక్రవారం ప్రారంభమవుతుందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. విజయవాడ బస్టాండ్‌లో ఏర్పాట్లను కలెక్టర్‌ సమన్వయ శాఖల అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, ఆర్డీఓ కావూరి చైతన్య, వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

లబ్బీపేట(విజయవాడతూర్పు): వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లోని సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్‌ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాచర్ల సుహాసిని ఆదేశించారు. నగరంలోని న్యూరాజరాజేశ్వరిపేట, ఇబ్రహీంపట్నం, చినలంక సడక్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆమె గురువారం పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను పరిశీలించారు. అదే విధంగా సడక్‌రోడ్డు ప్రాంతంలో వరద తీవ్రతను పరిశీలించి, గర్భిణులు, బాలింతలు ఉంటే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నపాటి అనారోగ్యం కలిగినా వెంటనే ప్రథమ చికిత్స చేయాలనే, అవసరమైతే ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు.

బస్టాండ్‌లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన 
1
1/1

బస్టాండ్‌లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement