పెనుగంచిప్రోలు ఆలయ ఉద్యోగులకు మెమోలు | - | Sakshi
Sakshi News home page

పెనుగంచిప్రోలు ఆలయ ఉద్యోగులకు మెమోలు

Jun 18 2025 7:24 AM | Updated on Jun 18 2025 7:26 AM

పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసిన శ్రీతిరుపతమ్మవారి ఆలయం విధులు నిర్వర్తిస్తున్న 27 మందికి పైగా ఉద్యోగులు, అర్చకులు, పురోహితులకు ఈఓ కిషోర్‌కుమార్‌ మంగళవారం మెమోలు జారీ చేశారు. ఈ నెల 13న ఉద్యోగుల రహస్య భేటీ అని వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం జరిగిందని, 14వ తేదీన ఆలయ ప్రాంగణంలో ఈఓ అనుమతి లేకుండా బాధ్యత కలిగిన ఉద్యోగులు సమావేశం నిర్వహించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయినందున మెమోలు జారీ చేసినట్లుగా ఈఓ పేర్కొన్నారు. మెమో అందిన ఏడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని, లేకుంటే చర్యలు తప్పవని స్పష్టచేశారు. అయితే దీనికి సంబం ధించి ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. నూతన కార్యవర్గ ఏర్పాటుకు సంబంధించి సమావేశం నిర్వహించామని ఉద్యోగులు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి ఆలయ అర్చకులు, పురోహితులు, ఉద్యోగులకు మెమోలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈఓ, ఉద్యోగులు, అర్చకులు, పురోహితుల మధ్య గతంలో ఎన్నడూ ఇంత వ్యతిరేకత లేదని గ్రామస్తులతో పాటు భక్తులు పేర్కొంటున్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించటంతో పాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్న ఉన్న తరుణంలో ఆలయంలో నెలకొన్న సంక్షోభంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు ఈ విషయంలో స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

బైక్‌పై విన్యాసాలు.. యువకుడిపై కేసు

కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణలంక జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంతో ఓ యువకుడు ప్రమాదకర విన్యాసాలు చేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసిన ఘటనపై కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా పెనుమాక గ్రామానికి చెందిన మోహన్‌ప్రసాద్‌, ఉయ్యాల సురేష్‌ ఇద్దరు స్నేహితులు. మోహన్‌ప్రసాద్‌ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని ఓ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతని బైక్‌ను కొన్ని రోజుల క్రితం సురేష్‌ తీసుకెళ్లి వెనుక మరో యువకుడిని ఎక్కించుకుని అర్ధరాత్రి కృష్ణలంక జాతీయ రహదారిపై విన్యా సాలు చేశాడు. బైక్‌ ముందు చక్రాన్ని పైకి లేపి వెనుక చక్రంపై నడిపిస్తూ విన్యాసాలు చేసి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశాడు. వాటిని ఎవరో ప్రయాణికులు వీడియో తీసి ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ఆ విన్యాసాలను ఇన్‌స్టా గ్రామ్‌లో ఈ నెల 15న మోహన్‌ప్రసాద్‌ చూశాడు. తన బైక్‌తోనే విన్యాసాలు చేశాడని గుర్తించాడు. గంటలో తీసుకొస్తానని చెప్పి తన బైక్‌ను తీసుకెళ్లి అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడిపాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మోహన్‌ప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

ట్రాక్టర్‌ డ్రైవర్‌ అనుమానాస్పద మృతి

గుడ్లవల్లేరు: మండలంలోని కౌతవరం శివారు పసుభొట్లపాలెంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ రేమల్లి వెంకట్రావు(45) అలియాస్‌ ముసలోడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శత్రువుల చేతి లో వెంకట్రావు హత్యకు గురయ్యాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మంగళవారం గ్రామంలోని రోడ్డు పక్కన గాయాలతో వెంకట్రావు విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గుడ్లవల్లేరు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీం ఆధారాలు చేపట్టే పనిలో ఉండగా, గుడివాడ డీఎస్పీ ధీరజ్‌ వినీల్‌ పరిస్థితిని పర్యవేక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమేశ్వరరావు, ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. మృతు డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి బంధువులను వైఎస్సార్‌ సీపీ నాయకులు మండలి హనుమంతరావు, నాగు, రాజు, ప్రసాద్‌ పరామర్శించారు.

పెనుగంచిప్రోలు ఆలయ ఉద్యోగులకు మెమోలు 1
1/2

పెనుగంచిప్రోలు ఆలయ ఉద్యోగులకు మెమోలు

పెనుగంచిప్రోలు ఆలయ ఉద్యోగులకు మెమోలు 2
2/2

పెనుగంచిప్రోలు ఆలయ ఉద్యోగులకు మెమోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement