రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

Jun 19 2025 7:58 AM | Updated on Jun 19 2025 7:58 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

కప్తానుపాలెం(మోపిదేవి): మండల పరిధిలోని పెదప్రోలు శివారు కప్తానుపాలెం వద్ద 216 జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కిలపర్తి దినేష్‌(24) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు అవనిగడ్డ మండలం పులిగడ్డకు చెందిన కిలపర్తి కీర్తిరాజు కుమార్డు దినేష్‌ వెల్డింగ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. మెటీరియల్‌ కోసం గుడివాడ వెళ్లి ఆ వస్తువులతో ద్విచక్రవానంపై పులిగడ్డ వస్తున్నాడు. మార్గమధ్యలో రేణిగుంట నుంచి మామిడి లోడుతో అన్నవరం వెళుతున్న లారీ కప్తానుపాలెం వద్ద ఎదురుగా వస్తున్న దినేష్‌ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొని సుమారు 20 మీటర్లకుపైగా రోడ్డుపై లాక్కుపోయింది. ఈ ప్రమాదంలో దినేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించి, వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement