ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం విఫలం

Jun 20 2025 6:45 AM | Updated on Jun 20 2025 6:45 AM

ప్రభుత్వం విఫలం

ప్రభుత్వం విఫలం

వరి విత్తనాల సరఫరాలో

తోట్లవల్లూరు: రైతులకు వరి విత్తనాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పామర్రు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్‌ విమర్శించారు. మండలంలోని గరికపర్రులో గురువారం ఆయన పర్యటించారు. గ్రామంలోని వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి విత్తనాలు దొరకడం లేదని, బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు రైతులు కై లే దృష్టికి తీసుకువచ్చారు. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో విత్తనాలు, ఎరువులు అందించడం జరిగిందని అనిల్‌కుమార్‌ గుర్తుచేశారు. రైతు భరోసా కేంద్రాల పేరు మార్చడమే కాకుండా వాటిని రైతులకు సేవలందించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. విత్తనాలు దొరకక రైతులు వ్యాపారులు, రైస్‌మిల్లర్లను ఆశ్రయించే పరిస్థితులు దాపురించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి రైతుల అవసరాలకు తగినట్లుగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని అనిల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు జొన్నల రామ్మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, వైస్‌ ఎంపీపీ కళ్లం శివారెడ్డి, సర్పంచ్‌లు బొమ్మారెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడిశెట్టి ఉదయభాస్కర్‌, నాయకులు నడకుదురు రాజేంద్ర, చింతలపూడి గవాస్కర్‌రాజు, చింతలపూడి సుబ్బారావు, మైనేని వేమూరి కృష్ణబాబు, తారాచంద్‌, బోలెం చంటి తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement