
రాజధానిలో మొక్కలకు డ్రోన్లతో వర్మీవాష్
తాడికొండ: రాజధాని అమరావతిలో పచ్చదనం పెంపొందించేందుకు, మొక్కలకు పోషకాలు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులు తెలిపారు. ప్రధాన అనుసంధాన రహదారి సీడ్ యాక్సిస్ రోడ్డుపై 10 కిలోమీటర్ల మేర పూల మొక్కలకు డ్రోన్ల ద్వారా వర్మీవాష్ చేసే ప్రక్రియను గురువారం ప్రారంభించారు. ఆర్గానిక్ పోషకాలను మొక్కలకు అందించడానికి ఈ పద్ధతి తోడ్పడుతుందని చెప్పారు. ప్రధానంగా ఈ పద్ధతిలో డ్రోన్ల ద్వారా జరిగే ప్రక్రియలో మొక్క పైనుంచి కింది భాగం వరకు పోషకాలు అందించవచ్చని తెలిపారు. దీని ద్వారా పూలు అందంగా పూయడంతో పాటు రహదారులు ఆకర్షణీయంగా ఉంటాయని చెప్పారు.