15 మంది పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు | - | Sakshi
Sakshi News home page

15 మంది పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

Apr 26 2025 1:31 AM | Updated on Apr 26 2025 1:33 AM

ఆంధ్రా ఆస్పత్రి పిడియాట్రిక్‌ చీఫ్‌ డాక్టర్‌ రామారావు

లబ్బీపేట(విజయవాడతూర్పు): పుట్టుకతోనే అత్యంత క్లిష్టతరమైన గుండె సమస్యలు ఉన్న 15 మంది చిన్నారులకు విజయవాడ ఆంధ్రా హాస్పటల్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. హీలింగ్‌ లిటిల్‌హార్ట్స్‌, యూకే చారిటీ సౌజన్యంతె ఈ నెల 21 నుంచి 34వ ఉచిత హార్ట్‌ సర్జరీస్‌ క్యాంపు నిర్వహించినట్లు ఆస్పత్రి పిడియాట్రిక్‌ చీఫ్‌ డాక్టర్‌ వెంకట రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రా హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సర్జరీల వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ బెంగుళూరుకు చెందిన పిడియాట్రిక్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ జగన్నాథ్‌తో పాటు, ఉషశెట్టి, అశ్విని కుమారస్వామిలతో పాటు, ఆంధ్రా హాస్పటల్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ నాగేశ్వరరావుల బృందం సర్జరీలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి నెలా 50 నుంచి 60 మంది పిల్లలకు గుండె సర్జరీలు చేస్తూ, ఇప్పటి వరకూ ఆస్పత్రిలో 4,500 మందికి చిన్నారులకు గుండె సర్జరీలు చేసినట్లు తెలిపారు. ఆంధ్రా మదర్‌ అండ్‌చైల్డ్‌ ఫౌండేషన్‌, మహేష్‌బాబు ఫౌండేషన్‌ సహకారం కూడా ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో శస్త్ర చికిత్సలు చేసిన వైద్యులు, పిడ్రియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ కె.విక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement