వెల్‌కమ్‌ పోలీస్‌ బాస్‌ | - | Sakshi
Sakshi News home page

వెల్‌కమ్‌ పోలీస్‌ బాస్‌

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

● ఆదిలాబాద్‌కు విచ్చేసిన డీజీపీ సీవీ ఆనంద్‌ ● నేడు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

సాక్షి,ఆదిలాబాద్‌/ఆదిలాబాద్‌టౌన్‌: రాష్ట్ర పోలీస్‌ బాస్‌ మంగళవారం రాత్రి ఆదిలాబాద్‌కు విచ్చేశారు. డీజీపీ సీవీ ఆనంద్‌కు కలెక్టర్‌ రాజర్షిషా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. వారి వెంట ఉమెన్‌ సేఫ్టీ, సీఐడీ డీజీ చారుసిన్హా ఉన్నారు. వీరు బుధవారం ఆదిలా బాద్‌ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.

బెల్లంపల్లిలో ఏడాదిపాటు అదనపు ఎస్పీగా..

డీజీపీ సీవీ ఆనంద్‌ తన కెరీర్‌ ప్రారంభంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లిలో ఆపరేషన్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (అడిషన ల్‌ ఎస్పీ)గా ఏడాది పాటు పనిచేశారు. నక్సలైట్లపై కూంబింగ్‌ ఆపరేషన్లకు స్వయంగా నాయకత్వం వహించారు. డీజీపీగా మే 1న బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు.

నేటి పర్యటన ఇలా..

డీజీపీ ఉదయం జిల్లా పోలీసు అధికారులతో క్రైమ్‌ రివ్యూ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం కలెక్టరేట్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం గుడిహత్నూర్‌ మండలం తోషం గ్రామానికి చేరుకుంటారు. ప్రజాపాలనలో భాగంగా నిర్వహించే గ్రామసభలో పాల్గొంటారు. వీటితో పాటు పలు ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement