కాగజ్నగర్టౌన్: వాహనదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటా మని డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. పట్టణంలో ఆదివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్ర మం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు సరైన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రజల భద్రత కో సం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సమాచారం అందించాలన్నారు. అ నంతరం సరైన పత్రాలు లేని 40 వాహనాల ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ ప్రేమ్కుమార్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


