కదిలిన ధాన్యం బస్తాలు
దహెగాం: కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తూకం వేయకపోవడం, బస్తాలకు మిల్లులకు తరలించడంలో జరుగుతున్న జాప్యంపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘లారీలు రాక.. ధాన్యం కదలక’ అనే కథనానికి అధికారులు స్పందించారు. దహెగాం మండలం కర్జి కొనుగోలు కేంద్రానికి అధికారులు లారీలు పంపించారు. గురు, శుక్రవారాల్లో నాలుగు లారీల ధాన్యం మిల్లులకు తరలించారని రైతులు తెలిపారు. అలాగే ఒడ్డుగూడ, లగ్గాం గ్రామాల్లోని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి సమీపంలోని పెంచికల్పేట్ గ్రామంలోని రైస్ మిల్లుకు తరలిస్తున్నారు.


