ఆసిఫాబాద్: గోండు బెబ్బులి, ఆదివాసీ పోరాట యోధుడు కుమురంభీం జన్మస్థలమైన ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లికి శుక్రవారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా రానున్నారు. గ్రామాన్ని హైదరా బాద్కు చెందిన నాగేంద్ర దత్తత తీసుకున్న విష యం తెలిసిందే.. కుమురంభీం స్ఫూర్తి గ్రామోత్సవం– 2026 పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. కుమురంభీంతోపాటు ఎడ్లకొండు 20 అడుగుల కాంస్య విగ్రహాల ఏర్పాటుకు గవర్నర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే సభావేదికను ఏర్పాటు చేశారు. ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని నిర్వహణ కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
పర్యటన ఇలా..
రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుక్రవారం ఉద యం హెలిక్యాప్టర్ ద్వారా బేగంపేట విమానాశ్ర యం నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఆసిఫా బాద్లోని కలెక్టరేట్కు చేరుకుంటారు. 11 గంట ల నుంచి 12.30 గంటల వరకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం 2.20 గంటలకు రోడ్డు మార్గం ద్వారా రౌటసంకెపల్లికి బయలుదేరుతారు. అక్కడ కుమురంభీం స్ఫూర్తి గ్రామోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5.25 గంటలకు హైదరాబాద్కు తిరిగి వెళ్తారని కలెక్టర్ కె.హరిత తెలిపారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ముగ్గురు సీఐలు, 19 మంది ఎస్సైలు, 27 మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, 130 మంది కానిస్టేబుళ్లు, 34 మంది టీజీఎస్పీ సిబ్బంది, 40 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది, 47 మంది హోంగార్డులు.. మొత్తం 300 మందితో బందోబస్తు నిర్వహించనున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన డీసీసీ అధ్యక్షురాలు
ఆసిఫాబాద్: మండలంలోని రౌటసంకెపల్లిలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన నేపథ్యంలో గురువారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివాసీల ఆత్మగౌరవం, జీవన విధానం, హక్కుల పరిరక్షణకు ప్రతీకగా గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారి వెంట క్రికెటర్ నాగేంద్ర, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.


