15 గ్రామాలకు ఇదే ఆధారం
ఆసిఫాబాద్రూరల్: మండలంలోని తుంపెల్లి వాగుపై నిర్మించిన వంతెనకు ఇరువైపులా ఎలాంటి రక్షణ పిల్లర్స్ లేవు. లోలెవల్ వంతెన కావడంతో వర్షాకాలం వాగు వరద వంతెన పైనుంచి ప్రవహిస్తుంది. దీంతో 15 గ్రామాలకు చెందిన ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. వాగుకు అవతలివైపు ఉన్న చిర్రకుంట, తుంపెల్లి, కొసార, వట్టివాగు, మాలన్గొంది, ఘుడెట్ ఘాట్, గొండుగూడ, శాకన్గొంది, యాపలపాడు, లింగన్గూడ, భీమన్గొంది, దాంపూర్, ఎర్రగుట్ట, మన్నేపల్లి, డోర్లి తదితర గ్రామాల ప్రజలు ఏటా అవస్థలు పడుతున్నారు.


