
కిన్నెరసానిలో పర్యాటక సందడి
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో శనివారం రాఖీ పౌర్ణమి సందడి కనిపించింది. మండల పరిధిలోని కిన్నెరసానికి శనివారం జిల్లా నలు మూలల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. 383 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.19,855 ఆదాయం లభించింది. 150 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.6,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.