వెల్గటూర్: గోదావరిలో పుణ్యస్నానాలకు వెళ్లి ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన వెల్గటూర్ మండలం కోటిలింగాలలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కరీంనగర్కు చెందిన శ్రీమంతుల విఘ్నేష్ (32) ఆదివారం సెలవు దినం కావడంతో తన భార్యతో కలిసి కోటిలింగాల వద్దగల గోదావరిలో పుణ్యస్నానాలకు వచ్చారు. గోదావరిలో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. భార్య కళ్ల ముందే భర్త నదిలో మునిగి మృతి చెందడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతుడి భార్య శ్రీలత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
గోదావరిలో మునిగి యువకుడి మృతి