
పట్టు పట్టి.. పీహెచ్డీ సాధించి..
‘పోక్సో’పై బాలికల
అవగాహన స్థాయి...
‘పోక్సో’పై బాలికల
అవగాహన స్థాయి అంశంపై...
ఓవైపు కుటుంబ బాధ్యతలు మోస్తూ.. మరోవైపు ఉద్యోగం చేస్తూ.. ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేసి విజయం సాధించారు ఆ మహిళామణులు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు మహిళలు తెలంగాణ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో తాము ఎంచుకున్న అంశంపై పరిశోధనలు చేశారు. ఇటీవల యూనివర్సిటీ స్నాతకోత్సవంలో
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాలను అందుకున్నారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
కామారెడ్డి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొ టెక్షన్ ఆఫీసర్ (డీసీపీవో) గా పనిచేస్తున్న స్రవంతి తెయూలో పీహెచ్డీ చేశా రు. పోక్సో చట్టంపై జిల్లా లోని కౌమార బాలబాలికలకున్న అవగాహన స్థాయిని అధ్యయనం చేసి పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ యూ నివర్సిటీ సౌత్క్యాంపస్ సోషల్ వర్క్ విభాగంలో విజయ్కుమార్ శర్మ పర్యవేక్షణలో ఆమె పరిశోధన సాగింది. ఇటీవల జరిగిన తెయూ స్నాతకోత్సవంలో ఆమె డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.
కుటుంబం, ఉద్యోగ
బాధ్యతలు మోస్తూనే
పరిశోధనలు
సమాజానికి మేలు
చేసే అంశాలతో..
డాక్టరేట్ పట్టా అందుకున్న మహిళా‘మణులు’

పట్టు పట్టి.. పీహెచ్డీ సాధించి..

పట్టు పట్టి.. పీహెచ్డీ సాధించి..