నిధులు సరిపోక నిలిచిన పనులు | - | Sakshi
Sakshi News home page

నిధులు సరిపోక నిలిచిన పనులు

Apr 28 2025 12:47 AM | Updated on Apr 28 2025 12:47 AM

నిధుల

నిధులు సరిపోక నిలిచిన పనులు

బోధన్‌: బోధన్‌ పట్టణ శివారులోని బోధన్‌–బాన్సువాడ బైపాస్‌ రోడ్డు సమీపంలో గల పసుపు వాగుపై హైలెవల్‌ వంతెన నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. పనులకు కెటాయించిన నిధులు సరిపోక, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీన వైఖరి ఇలా అనేక కారణాల వల్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయి, ముందుకు సాగడం లేదు. కాలయాపన వల్ల పనుల అంచనా వ్యయం పెరిగిపోతోంది. మరో వైపు అదనపు నిధుల కోసం పంపిన ప్రతిపాదనలు మేరకు నిధుల మంజూరులో ఆలస్యం జరుగుతోంది. అయినా పాలకులు, అధికారులు స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు.

ఐదేళ్ల క్రితం ప్రతిపాదనలు..

పసుపు వాగుపై వంతెన నిర్మాణం కోసం 2021–22 ఆర్థిక సంవత్సంరలో పీఎంజీఎస్‌వై (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన) కింద రూ. 3కోట్ల నిధులు మంజూరయ్యాయి. పీఆర్‌ ఇంజినీరింగ్‌ శాఖ పనుల కోసం టెండర్లు నిర్వహించగా 2023లో ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్‌కు అప్పగించారు. 2023 సెప్టెంబర్‌లో పనులు ప్రారంభించి 2025 మార్చి 1వరకు పూర్తి చేయాలని గడువు విధించారు. కానీ గడువు ముగిసిపోయిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 10 పిల్లర్లు నిర్మించగా, రెండు పిల్లర్ల మేర స్లాబ్‌ వేసి వదిలేశారు. ఐదేళ్ల క్రితం ప్రతిపాదనల మేరకు మంజూరైన నిధులతో పనులు పూర్తి చేశామని, మరో రూ.3 కోట్లు నిధులు మంజూరుకు ఏడాదిక్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు అధికారులు చెబుతున్నారు. నిధులు ఎప్పుడు మంజూరవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

బోధన్‌–కోటగిరి మండలాలకు అనుసంధానం

బోధన్‌ పట్టణ శివారు నుంచి పసుపు వాగు వంతెన మీదుగా కోటగిరి మండలంలోని ఎత్తొండ, రాయ్‌కూర్‌, దోమలెడ్గి వరకు సుమారు 14 కిలో మీటర్ల పొడువున పీఎంజీఎస్‌వై కింద రూ.6 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి రెండేళ్ల క్రితమే పూర్తిచేశారు. వాగుపై చేపట్టిన వంతెన నిర్మాణం పూర్తి చేస్తే కోటగిరి మండల ప్రజలకు పట్టణ కేంద్రానికి వచ్చేందుకు దూరం తగ్గడమే కాక మరింత సౌకర్యంగా మారనుంది. ప్రస్తుతం వాగులో తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు మీదుగా రెండు మండలాల ప్రజలు రాకపోకలు సాగుతున్నాయి. అలాగే పసుపు వాగు అవతలి ఒడ్డున పట్టణ రైతులకు సంబంధించి 250 ఎకరాలకు పైగా సాగు భూములున్నాయి. వర్షాకాలంలో పంట పొలాలకు వెళ్లెందుకు ఏళ్లుగా రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. వంతెన పూర్తయితే సాగు కష్టాలు తీరుతాయని సంబుర పడ్డారు. కానీ పనులు ముందుకు సాగకపోవడంతో రైతులు, ఇరు మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి, పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

బోధన్‌ శివారులోని పసుపువాగుపై

ఏడాది క్రితం వంతెన పనులు ప్రారంభం

రూ.3కోట్ల నిధులు సరిపోక

అర్ధంతరంగా నిలిచిన బ్రిడ్జి నిర్మాణం

నిధులు సరిపోక నిలిచిన పనులు1
1/1

నిధులు సరిపోక నిలిచిన పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement