‘సేవలతోనే సమాజంలో గుర్తింపు’ | - | Sakshi
Sakshi News home page

‘సేవలతోనే సమాజంలో గుర్తింపు’

Mar 27 2025 1:23 AM | Updated on Mar 27 2025 1:21 AM

భిక్కనూరు: విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవల్లో పాల్గొంటేనే సమాజంలో గుర్తింపు వస్తుందని తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్‌ ప్రిన్సిపల్‌ సుధాకర్‌గౌడ్‌ పేర్కొన్నారు. బుధవారం సౌత్‌క్యాంపస్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రెడ్‌ రిబ్బన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సమాజ అభ్యున్నతికి పాటుపడాలన్నారు. అనంతరం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌లపై విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సౌత్‌ క్యాంపస్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి బందెల అంజయ్య, అధ్యాపకులు మోహన్‌బాబు, ప్రతిజ్ఞ, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement