
వర్షాలతో ఇబ్బంది
సీడ్ క్రాసింగ్ పనుల కోసం ప్రతి ఏటా జూలై ఈ ప్రాంతానికి వస్తాం. రైతులు మాతో ముందస్తుగా మాట్లాడుకుంటారు. నెలకు రూ.20వేల నుంచి రూ.22వేలు చెల్లిస్తారు. రైతు వీలును బట్టి 30 నుంచి 60 రోజుల వరకు క్రాసింగ్ పనులు చేపడతాం. ఈ ఏడాది ఎడతెరిపి లేని వర్షాలతో కొంత ఇబ్బంది నెలకొంది. క్రాసింగ్ చేసినవి కాయలుగా మారకుండా రాలిపోతాయనే భయం వెంటాడుతోంది. – యాకోబు, వలస కూలి,
గుడేకల్లు గ్రామం, ఎమిగనూర్ మండలం, కర్నూలు జిల్లా