
ప్రజావాణికి 40 ఫిర్యాదులు
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు మొత్తం 40 ఫిర్యాదులను కలెక్టర్కు నేరుగా అందజేశారు. అనంతరం వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించడం జరిగిందని, వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్కు 10 అర్జీలు
గద్వాల క్రైం: భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదంటూ మొత్తం 10 ఫిర్యాదులను ఎస్పీ శ్రీనివాస్రావుకు అందజేశారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ నిర్వహించారు.