కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలి

Apr 25 2025 8:22 AM | Updated on Apr 25 2025 8:22 AM

కొనుగోళ్లు  పారదర్శకంగా ఉండాలి

కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలి

ధరూరు: ఐకేపీ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియా నాయక్‌ అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంతోపాటు మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల మహిళా సమాఖ్య సభ్యులతో మాట్లాడి కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేయాలని, మ్యాచర్‌ మిషన్‌ ఆధారంగా వచ్చిన తేమ వివరాలను తీసుకుని ధాన్యం సేకరించాలని మండల అధికారి శ్రీలత, ఐకేపీ అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి తీసుకునే ఆధార్‌, పట్టాదార్‌ పాస్‌ బుక్‌, అకౌంట్‌ నంబర్ల జిరాక్స్‌ కాపీలను సరిచూసుకుని ధాన్యం సేకరించాలన్నారు.

సిబ్బంది బాధ్యతగా

వ్యవహరించాలి

గద్వాల క్రైం: పోలీసుస్టేషన్‌ పరిధిలో సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాల్సిందిగా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం వివిధ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్స్‌గా విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమస్యలతో వచ్చిన బాధితులకు స్టేషన్‌లోని హెడ్‌ కానిస్టేబుల్స్‌ మాట్లాడి వాటిని పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కోర్టు కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా ముందుకెళ్లాలని సూచించారు. సమావేశంలో సీసీఎస్‌ సీఐ నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేరుశనగ క్వింటా రూ.6,339

గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు గురువారం 299 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 6339, కనిష్టం రూ. 3099, సరాసరి రూ. 5699 ధరలు పలికాయి. 6 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ 6300, కనిష్టం రూ 5869. సరాసరి రూ. 6308 ధరలు వచ్చాయి. 94 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5921, కనిష్టం రూ. 4607, సరాసరి రూ. 5921 ధరలు పలికాయి. 1665 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.1980, కనిష్టం రూ. 1709, సరాసరి రూ.1960 ధరలు లభించాయి.

మొక్కజొన్న క్వింటాల్‌ రూ.2,271

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్‌ యార్డులో గురువారం మొక్కజొన్నకు క్వింటాల్‌ గరిష్టంగా రూ.2,271, కనిష్టంగా రూ.1,409 ధరలు లభించాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,191, కనిష్టంగా రూ.4,000, ఆముదాలు గరిష్టంగా రూ.6,510, కనిష్టంగా రూ.5,841, జొన్నలు గరిష్టంగా రూ.4,355, కనిష్టంగా రూ.3,627, కందులు రూ.6,480, ధాన్యం హంస రూ.1,869, ఆర్‌ఎన్‌ఆర్‌ గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.1,802, రాజేంద్ర రకం రూ.1,916 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం గరిష్టంగా రూ.,2212, కనిష్టంగా రూ.1,806, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,769, కనిష్టంగా రూ.1,639, ఆముదాల గరిష్టంగా రూ.5950గా ఒకే ధర నమోదైంది.

నేడు డయల్‌ యువర్‌ ఏటీఎం లాజిస్టిక్‌

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఆర్టీసీ లాజిస్టిక్‌ సమస్యల కోసం శుక్రవారం డయుల్‌ యువల్‌ ఏటీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇసాక్‌ బిన్‌ మహ్మద్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ కార్గో సంబంధిత సమస్యలను 8125456978 నంబర్‌కు ఫోన్‌ ద్వారా తెలియజేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రామన్‌పాడులో 1,015 అడుగుల నీటిమట్టం

మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో గురువారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు గాను 1,015 అడుగులు ఉందని ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. దీంతో జలాశయంలోని ఎన్టీఆర్‌ కాల్వ ద్వారా 2 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వల నుంచి 18, తాగునీటికి 20 క్యూసెక్కుల నీటిని వదిలారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement