● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
భూపాలపల్లి అర్బన్: ఉద్యోగ బాధ్యతలను నిబద్ధతతో, అంకితభావంతో నిర్వర్తించినప్పుడే సహచరులు, అధికారులు, ప్రజల మన్ననలు పొందగలరని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. పదవీ విరమణ పొందిన జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ సన్మాన కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యాశాఖలో 42 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేసిన రాజేందర్ తనకు అప్పగించిన బాధ్యతలను అత్యంత నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వర్తించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఈఓ లలిత, సీపీఓ క్రిష్టయ్య, ఎస్సీ అభివృద్ధి అధికారి సుకీర్తి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్, స్పోర్ట్స్ ఆఫీసర్ రఘు, డీసీఎస్ఓ కిరణ్కుమార్, డీపీఆర్ఓ శ్రీనివాస్, ఏఎంఓ విజయపాల్రెడ్డి, సెక్టోరియల్ అధికారులు రమేశ్, రాజగోపాల్, రామకృష్ణ, శైలజ, ఎంఈఓలు పాల్గొన్నారు.


