● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్: జానపద కళలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో కళాకారుల పాత్ర కీలకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గుర్తింపు జానపద కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు అందజేస్తున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో కళాకారులు ఆదివారం కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. కార్డులు అందజేయడం ద్వారా సంక్షేమ పథకాలు చేరువవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుతోజ్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.


