న్యూస్రీల్
మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2026
7
రాష్ట్రం ఏర్పడిన అనంతరం గురుకులాలు, మహాత్మా జ్యోతిబా పూలే లాంటి హాస్టళ్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ భవనం నిర్మించాలని ప్రస్తుత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు జిల్లాలోని గణపురం మండలం గాంధీనగర్ శివారులో రూ.196 కోట్లతో గతేడాది అక్టోబర్ 10న భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ పనులు పురోగతిలో ఉన్నాయి. స్కూల్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందనుంది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం జిల్లాలో ఒక మైనార్టీ, రెండు ఎస్సీ, రెండు ఎస్టీ, రెండు బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసింది.
కార్పొరేట్ స్థాయి విద్య..


