
వాతావరణం
జిల్లాలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
దేశాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిషిధర్రెడ్డి
రేగొండ: దేశాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి అన్నారు. బుధవారం కొత్తపల్లిగోరి మండలం కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు సూదనబోయిన విష్ణుయాదవ్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ విధానాలు ప్రపంచానికే దిక్సూచిగా మారుతున్నాయన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానాన్ని తీసుకురావడంలో మోదీ సఫలీకృతం అయ్యారన్నారు. అనంతరం ఇటీవల నూతనంగా వచ్చిన తహసీల్దార్ లక్ష్మిరాజయ్యను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ లింగంపల్లి ప్రసాదరావు, సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, సుమన్, వేణు, బాబురావు, విమల, సదానందం తదితరులు పాల్గొన్నారు.
226 క్వింటాళ్ల
రేషన్ బియ్యం పట్టివేత?
చిట్యాల: మండలంలోని కొత్తపేట గ్రామ శివారు మేఘన రైస్ మిల్లు వద్ద 266 క్వింటాళ్ల రేషన్ సన్న బియ్యం లారీని జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు, స్థానిక పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు మిల్లు వద్ద వేచి చూసి దాడులు నిర్వహించారు. దీంతో లారీలో ఉన్న సన్నబియ్యం స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారా..లేదా? అనేది నేడు (గురువారం) నిర్థారణ కో సం బియ్యం నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. ఈ విషయంపై ఎస్సై ని వివరణ కోరగా లారీని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వాతావరణం