
‘భూభారతి’ నిరంతర ప్రక్రియ
కాళేశ్వరం: భూభారతి సదస్సులో దరఖాస్తు చేసుకోనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) అశోక్కుమార్ తెలిపారు. బుధవారం మహదేవపూర్ మండలం కుంట్లంలో జరిగిన భూభారతి సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. సోమవారం నుంచి సంబంధిత ఆధారాలతో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు జరిగిన రెవెన్యూ సదస్సులో మొత్తం 2,640 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామారావు, డీటీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.