ఉద్యమంలో ముగిసిన గాజర్ల కుటుంబ ప్రస్థానం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమంలో ముగిసిన గాజర్ల కుటుంబ ప్రస్థానం

Jun 19 2025 7:41 AM | Updated on Jun 19 2025 7:41 AM

ఉద్యమ

ఉద్యమంలో ముగిసిన గాజర్ల కుటుంబ ప్రస్థానం

గాజర్ల

రవి (ఫైల్‌)

భూపాలపల్లి/టేకుమట్ల: వెలిశాల తల్లడిల్లింది. ఈ ప్రాంతంలో నక్సల్స్‌ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో మరొకరు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. 2008లో గాజర్ల సారయ్య అలియాస్‌ ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోగా, తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి అడవుల్లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన తమ్ముడు రవి అలియాస్‌ గణేష్‌ మృతిచెందాడు. దీంతో మావోయిస్టు ఉద్యమంలో గాజర్ల కుటుంబ ప్రస్థానం ముగిసినట్లయ్యింది. విషయం తెలియడంతో వెలిశాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉద్యమాల బిడ్డ–నిను మరువదు పోరు గడ్డ అంటూ పలువురు ఉద్యమకారులు రవి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

మూగబోయిన వెలిశాల..

ఎన్‌కౌంటర్‌లో రవి మృతి చెందిన విషయం తెలిసి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నక్సల్స్‌ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో ఇద్దరు ఉద్యమకారులు నేలకొరిగారంటూ గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులు రవితో గడిపిన సమయాలను నెమరువేసుకుంటున్నారు.

2008లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాజర్ల సారయ్య హతమవగా కుటుంబ సభ్యులు జ్ఞాపకార్థంగా ఆయన విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేశారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇప్పటికీ కూలిపోయిన సారయ్య విగ్రహం అక్కడ ఉంది. కాగా, గాజర్ల కుటుంబంలో నక్సల్స్‌లో చేరిన ముగ్గురిని చూసి గ్రామంలో చాలామంది ఉద్యమ బాట పట్టారు. దీంతో 2005లో అప్పటి సీఐ శ్యాంసుందర్‌రెడ్డి, ఎస్సై ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వెలిశాల గ్రామంలో శాంతి స్తూపాన్ని ఏర్పాటు చేశారు.

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత రవి మృతి

33 ఏళ్ల క్రితం ఎర్రజెండా పట్టి

అజ్ఞాతంలోకి..

సెంట్రల్‌ కమిటీ సభ్యుడి హోదాలో మరణం

వెలిశాలలో ముగిసిన అన్నల శకం

ఉద్యమంలో ముగిసిన గాజర్ల కుటుంబ ప్రస్థానం1
1/2

ఉద్యమంలో ముగిసిన గాజర్ల కుటుంబ ప్రస్థానం

ఉద్యమంలో ముగిసిన గాజర్ల కుటుంబ ప్రస్థానం2
2/2

ఉద్యమంలో ముగిసిన గాజర్ల కుటుంబ ప్రస్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement