
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
చిట్యాల: ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి బీజేపీ కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశీధర్రెడ్డి కోరారు. గురువారం మండలంలోని జూకల్ ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో విజయ సంకల్పసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిశీధర్రెడ్డి మాట్లాడుతూ.. మోదీ 11 సంవత్సరాల కాలంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదలకు అండగా నిలుస్తున్నాడని అన్నారు. రానున్న ఎన్నికలలో మండలంలో బీజేపీ జెండా ఎగిరేలా కృషి చేయాలని కోరారు. అందుకోసం ప్రతీ కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వికసిత్ భారత్ జిల్లా కన్వీనర్ జన్నే మొగిలి, మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిశీధర్రెడ్డి